Bible, యోహాను సువార్త, అధ్యాయం 6. is available here: https://www.bible.promo/chapters.php?id=11003&pid=45&tid=2&bid=61
Holy Bible project logo icon
FREE OFF-line Bible for Android Get Bible on Google Play QR Code Android Bible

Holy Bible
for Android

is a powerful Bible Reader which has possibility to download different versions of Bible to your Android device.

Bible Verses
for Android

Bible verses includes the best bible quotes in more than 35 languages

Pear Bible KJV
for Android

is an amazing mobile version of King James Bible that will help you to read this excellent book in any place you want.

Pear Bible BBE
for Android

is an amazing mobile version of Bible in Basic English that will help you to read this excellent book in any place you want.

Pear Bible ASV
for Android

is an amazing mobile version of American Standard Version Bible that will help you to read this excellent book in any place you want.

BIBLE VERSIONS / Bible / కొత్త నిబంధన / యోహాను సువార్త

Bible - Telugu Bible OV, 1880

లూకా సువార్త యోహాను సువార్త అపొస్తలుల కార్యములు

అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

1 "అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను."

2 రోగుల యెడల ఆయన చేసిన సూచకక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి.

3 యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండెను.

4 అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను.

5 "కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి - ''వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుము'' అని ఫిలిప్పు నడిగెను గాని,"

6 ఏమి చేయనై యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను.

7 అందుకు ఫిలిప్పు - వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను.

8 "ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ -"

9 "ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యొద్ద అయిదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నవి గాని; ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా,"

10 యేసు - ''జనులను కూర్చుండబెట్టుడి'' అని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు కూర్చుండిరి.

11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను. అలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను.

యోహాను సువార్త 6:11 - Jesus Feeds the 5000
Jesus Feeds the 5000
12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.

13 కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి.

14 ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి - నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.

15 "రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు యెరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను."

16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపుటద్దరి నున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

17 అంతలో చీకాటాయెను గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు.

18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను.

19 "వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రము మీద నడుచుచు తమ దోనెదగ్గరకు వచ్చుట చూచి భయపడిరి;"

20 "అయితే ఆయన ''నేనే, భయపడకుడి'' అని వారితో చెప్పెను."

21 కనుక ఆయనను దోనె మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడిరి. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న ప్రదేశమునకు చేరెను.

22 "మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి."

23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియ నుండి వేరే చిన్న దోనెలు వచ్చెను.

24 కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలు ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి.

25 "సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని - బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా,"

26 "యేసు - ''మీరు సూచనలను చూచుట వలన కాదు, గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకు చున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

27 "క్షయమైన ఆహారముకొరకు కష్టపకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్ర వేసియున్నాడు'' అని చెప్పెను."

28 "వారు - మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా,"

29 యేసు - ''ఆయన పంపినవాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని'' వారితో చెప్పెను.

30 వారు - అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు?

31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి.

32 "కాబట్టి యేసు - ''పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు."

33 "పరలోకము నుండి దిగి వచ్చి, లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని వారితో చెప్పెను."

34 "కావున వారు - ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడును మాకు అనుగ్రహించుమనిరి."

35 అందుకు యేసు వారితో ఇట్లనెను - ''జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు. నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు.

36 మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని.

37 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయును.

38 నా ఇష్టమును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని.

39 "ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది."

40 కుమారుని చూచి ఆయనయందు విశ్వాస ముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును.''

41 కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు -

42 ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.

43 అందుకు యేసు - ''మీలో మీరు సణుగుకొనకుడి;

44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

45 వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును.

46 దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.

47 విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు.

48 జీవాహారము నేనే.

49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.

50 దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే.

51 పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను.

52 యూదులు- ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి.

53 "కావున యేసు ఇట్లనెను -''మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు."

54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.

56 "నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము."

57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.

58 ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము; పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అనెను

59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను.

60 "ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి."

61 యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను - ''దీనివలన మీరు అభ్యంతర పుచున్నారా?

62 అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు ?

63 "ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై యున్నవి, గాని"

64 "మీలో విశ్వసించనివారు కొందరున్నారు'' అని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటి నుండి యేసునకు తెలియును."

65 మరియు ఆయన - ''తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని'' అనెను.

66 "అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు."

67 కాబట్టి యేసు - ''మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?'' అని పన్నెండు మందిని అడుగగా.

68 "సీమోను పేతురు - ప్రభువా, ఎవనియొద్దకు వెళ్లుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;"

69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి యున్నామని ఆయనతో చెప్పెను.

70 అందుకు యేసు - ''నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పచు కొనలేదా? మీలో ఒకడు సాతాను'' అని వారితో చెప్పెను.

71 సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి ఆయనను అప్పగింపబోవు చుండెను గనుక వానిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను.

<< ← Prev Top Next → >>