1 "ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన"
2 "తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఆయన చేయుటకును, బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని"
3 "ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనపరచుకొనెను."
4 "ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను - మీరు యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రియొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి."
5 యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను.
6 "కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు- ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా, ఆయన -"
7 "కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు. దానిని తెలిసికొనుట మీ పనికాదు."
8 "అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములందంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను."
9 "ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను."
10 "ఆయన వెళ్ళుచుండగా, వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి"
11 గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
12 "అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి, యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది."
13 "వారు పట్టణములో ప్రవేశించి, తాము బసచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా - పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు."
14 "వీరందరును, వీరితో కూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు, ఆయన సహోదరులును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి."
15 ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువది మంది సహోదరులు కూడి యుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను -
16 "''సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను."
17 "అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై, ఈ పరిచర్యలో పాలుపొందెను."
18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.
19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా -
20 (కీర్తనలు69:25) ''వారి పాళెము పాడవును గాక ! వారి గుడారములలో ఎవడును ఉండక పోవును గాక'' (కీర్తన109:8) ''వాని జీవిత దినములు కొద్దివగును గాక! వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనును గాక'' అని వ్రాయబడియున్నది
21 "కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు"
22 "మనతో కలసియున్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను."
23 "అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యేసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి,"
24 "ఇట్లని ప్రార్థన చేసిరి - 'అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,"
25 "తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను, అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచు మనిరి."
26 అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదకొండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను. |